AP Corona cases: ఏపీలో కొత్తగా 4,348 మందికి కొవిడ్​ పాజిటివ్​- 14 వేలపైకి యాక్టివ్​ కేసులు

AP Corona cases: ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొవిడ్​ కారణంగా ఇద్దరు (Corona death in AP) ప్రాణాలు కోల్పోయారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 05:30 PM IST
  • ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
  • తాజాగా 4 వేల మందికిపైగా పాజిటివ్​
  • క్రితం రోజుతో పోలిస్తే భారీ వృద్ధి నమోదు
  • 14 వేల పైకి యాక్టివ్​ కొవిడ్ కేసులు
AP Corona cases: ఏపీలో కొత్తగా 4,348 మందికి కొవిడ్​ పాజిటివ్​- 14 వేలపైకి యాక్టివ్​ కేసులు

AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 4,348 మందికి కొవిడ్​ పాజిటివ్​ (Corona cases in AP) వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 47,884 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది.

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. కృష్ణా, శ్రీకాకులం జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,507 మంది కొవిడ్​కు బలయ్యారు.

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 261 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,63,516 మంది కరోనాను జయించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,204 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.

జిల్లాల వారీగా ఇలా..

చిత్తురులో అత్యధికంగా 3,048 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. ఆ తర్వాత విశాఖపట్నంలో 2,746 కేసులు, కృష్ణ, పశ్చిమ గోదవావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 1000కిపైగా యాక్టివ్​ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. మిగతా అన్ని జిల్లాలోనూ రెండు వందలకుపైగానే యాక్టివ్​ కేసులు ఉన్నట్లు పేర్కొంది.

ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,17,56,521 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 2,092,227  శాంపిళ్లు పాజిటివ్​గా తేలినట్లు వివరించింది.

మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.

Also read: APSRTC Jobs: మోసగాళ్ల పట్ల జాగ్రత్త.. నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్​టీసీ అలర్ట్​!

Also read: DP Leader Murder Case: గుంటూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య.. అధికార పార్టీ నేతలే కారణమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News