AP Corona cases: ఏపీలో 13 వేలపైనే తాజా కొవిడ్ కేసులు- భారీగా పెరిగిన రికవరీలు

AP Corona cases: ఏపీలో కరోనా కేసులు అతి స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ కొత్త కేసులు 13 వేలపైనే నమోదయ్యాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 05:45 PM IST
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • మహమ్మారికి మరో 9 మంది బలి
  • విశాఖపట్నంలో ఒకే రోజు ముగ్గురు మృతి
AP Corona cases: ఏపీలో 13 వేలపైనే తాజా కొవిడ్ కేసులు- భారీగా పెరిగిన రికవరీలు

AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే దాదాపు స్థిరంగా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 13,474 మందికి కరోనా పాజిటివ్​గా​ (Corona cases in AP) తేలినట్లు ఏపీ ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం ప్రకటించింది.

బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 49,771 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది ఆరోగ్య విభాగం. క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల సంఖ్య పెరగటం గమనార్హం.

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 10,290 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,111,975 మంది కరోనాను జయించారు. క్రితం రోజుతో పోలిస్తే రికవరీలు కూడా భారీగా పెరిగాయి.

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా రాష్ట్రంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది.

విశాఖపట్నంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,579 మంది కొవిడ్​కు బలయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,09,493 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.

జిల్లాల వారీగా యాక్టివ్ కేసులు..

విశాఖపట్నంలో అత్యధికంగా 13,289 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. ఆ తర్వాత గుంటూరులో 11,309 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో అత్యల్పంగా 3,327 యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాలలో నాలుగు వేలకుపైనే యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య విభాగం డేటాలో వెల్లడైంది.

ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,23,25,140 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 2,236,047  శాంపిళ్లు పాజిటివ్​గా తేలినట్లు వివరించింది.

మొత్తం కేసుల్లో ఏపీకి చెందిన వారితో పాటు రాష్ట్రానికి వచ్చిన ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు కూడా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వివరించింది.

Also read: AP New Districts News: "పీఆర్సీ, క్యాసినోలను పక్కదారి పట్టించేందుకే ఈ జిల్లాల ప్రతిపాదన"

Also read: Guntur: సెల్ఫీ కోసం గూడ్స్ రైలు ఎక్కాడు... చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News