Nepal Bus Accident: లోయలో పడిన బస్సు... 14 మంది దుర్మరణం!

Nepal Bus Accident: నేపాల్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిన ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 06:48 PM IST
Nepal Bus Accident: లోయలో పడిన బస్సు... 14 మంది దుర్మరణం!

Nepal Bus Accident: నేపాల్‌లో (Nepal) ఘోర దుర్ఘటన జరిగింది. బస్సు లోయలో పడిన ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. తూర్పు నేపాల్​లో​ గురువారం ఉదయం 7.30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం (Bus Accident) చోటుచేసుకుంది. 20 మంది ప్రయాణికులతో కూడిన బస్సు..శంఖువాసవలోని మాడి నుంచి ఝాపాలోని దమక్‌కు వెళ్తుండగా.. బస్సు అదుపు తప్పి 300 మీటర్ల లోతు లోయలో పడింది. 

''ఈ ప్రమాదంలో కనీసం 14 మంది చనిపోయారు. మృతులను ఇంకా గుర్తించలేదు'' అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి ఐదుగురిని సజీవంగా రక్షించారు. అయినప్పటికీ, వారికి గాయాలు తగిలాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు  చేపట్టారు. మృతులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. 

నేపాల్‌లో ముఖ్యంగా పర్వత ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు చాలా సాధారణం. గత నెలలో పశ్చిమ నేపాల్‌లో నూతన వధూవరులతోపాటు కొంతమంది బంధువులతో వెళ్తున్న వాహనం అదుపతప్పిలోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

Also Read: Ukraine crisis: యుద్ధ భూమిలో పోరాడుతూ మరణించిన ఉక్రెయిన్ నటుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News