Tirumala: రేపు శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

Tirumala: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను గురువారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అక్టోబరు నెలకు సంబంధించిన కోటాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో ఇవ్వనుంది టీటీడీ. అయితే వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని ఇప్పటికే టీటీడీ అధికారులు తెలిపారు. అక్టోబర్‌ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసినట్లు వెల్లడించారు.

  • Zee Media Bureau
  • Aug 17, 2022, 02:18 PM IST

Video ThumbnailPlay icon

Trending News