టీఆర్ఎస్‌ - ఎంఐఎంలకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చురకలు

టీఆర్ఎస్‌ - ఎంఐఎంలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శలు

Last Updated : Sep 20, 2018, 06:41 PM IST
టీఆర్ఎస్‌ - ఎంఐఎంలకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చురకలు

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒత్తిడికి లోబడి నడుచుకుంటోందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అభిప్రాయపడ్డారు. 2017 ఏప్రిల్‌లో శ్రీరామ నవమిని పునస్కరించుకుని శోభాయాత్ర నిర్వహించగా దానిపై అదే ఏడాది నవంబర్ లో ఓ కేసు నమోదైందని గతంలో జరిగిన ఈ రెండు ఘటనలను ట్విటర్ ద్వారా గుర్తు చేసిన రాజాసింగ్.. ఆ కేసుకు సంబంధించిన కాపీ తనకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు అందింది అని అందులో పేర్కొన్నారు. రేపు ఉదయం 10 గంటలకు తనను పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారని చెబుతూ.. తనపై ఎటువంటి ఒత్తిళ్లు పనిచేయబోవని ఈ సందర్భంగా రాజా సింగ్ స్పష్టంచేశారు. అంతేకాకుండా తనపై ఒత్తిళ్లు తీసుకురావాలనుకోవడం ఓ విఫలయత్నమే అవుతుందని రాజా సింగ్ ధీమా వ్యక్తంచేశారు.

 

Trending News