రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

Last Updated : Feb 4, 2018, 01:38 PM IST
రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయాలని సూచించారు.

శనివారం ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అడ్వైజర్ జి.ఆర్.రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర ప్రధాన మార్కెటింగ్ ఆఫీసర్ (సిఎంఓ) అధికారులు హాజరయ్యారు. గ్రామీణ పేద ప్రజలు తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతున్నారని రిపోర్టులు అందటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మంత్రులు, ఎంఎల్ఏలు ఈ కంటి శిబిరాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అవసరమైతే రాష్ట్రంలో ఉన్న కంటి నిపుణులతో పాటు, ఇతర రాష్ట్రాల వైద్యుల సేవలనూ ఉపయోగించుకోవాలని కేసీఆర్ సూచించారు.

Trending News