Food Processing Units In Telangana: తెలంగాణలో రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్

Food Processing Units In Telangana: తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం తెలిపారు. అందులో భాగంగానే ప్రస్థుతం ఉన్న రైస్ మిల్లులు యధా విధిగా కొనసాగుతూనే, అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించే దిశగా కార్యాచరణ చేపడుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.

Written by - Pavan | Last Updated : Jul 22, 2023, 11:06 AM IST
Food Processing Units In Telangana: తెలంగాణలో రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్

Food Processing Units In Telangana: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని దిగుబడి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరుకున్నదని, అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులు సహా మరి కొద్దిరోజుల్లో పూర్తికానున్న పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులతో రాష్ట్రంలో వరిధాన్యం దిగుబడి మరో కోటి టన్నులకు పెరిగి 4 కోట్ల టన్నులకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యవసాయ విధానంలో భాగంగా ఫుడ్ ప్రాసెస్ కంపెనీలను స్థాపించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా మిల్లింగ్ కెపాసిటీని పెంచే దిశగా రాష్ట్రంలో కొనసాగుతున్న మిల్లులకు అధనంగా మరిన్ని అధునాతన రైస్ మిల్లులను అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు.
 
రాష్ట్రంలో నిల్వ వున్న 1 కోటి 10 లక్షల టన్నుల వరిధాన్యం, 4 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకోకుండా ఎఫ్ సీ ఐ పలు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నదని, ఈ పంట ఇట్లా ఉంటే అదనంగా మరింత వరి ధాన్యం దిగుబడి కానున్న పరిస్థితుల్లో.. రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసి, రైతుకు మరింత లాభం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
 
తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం తెలిపారు. అందులో భాగంగానే ప్రస్థుతం ఉన్న రైస్ మిల్లులు యధా విధిగా కొనసాగుతూనే, అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించే దిశగా కార్యాచరణ చేపడుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణలో ప్రస్థుతం ఉన్న రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు మాత్రమే ఉందన్నారు. మరో 2 కోట్ల టన్నుల వరిధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా మిల్లులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో అదనంగా పండుతున్న ధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి తగ్గట్టుగా అధునాత రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఇందుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయడం కోసం సిఎం కేసీఆర్ ఓ కమిటీని ప్రకటించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధ్యక్షులుగా, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటి ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, టిఎస్ ఐఐసి ఎండీ నర్సింహా రెడ్డి సభ్యులుగా కొనసాగుతారు. ఇందుకు సంబంధించి, శుక్రవారం నాడు డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సిఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపి దామోదర్ రావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటి ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, టిఎస్ఐఐసి ఎండీ నర్సింహా రెడ్డి, వారితో పాటు, అంతర్జాతీయ రైస్ మిల్లు తయారీ కంపెనీ సటాకే’ ఇండియా డైరక్టర్ ఆర్. కె.బజాజ్ తదితర ప్రతినిధులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Himayat Sagar, Usman Sagar: హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు వరద నీరు.. గేట్లు ఎత్తివేత
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, " పంటకు పెట్టుబడి అందించడం నుంచి ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించి కొనేదాకా దేశంలో మరే రాష్ట్రం చేపట్టని విధంగా రైతు సంక్షేమాన్ని కొనసాగిస్తూ, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నం. ఇవాళ తెలంగాణ పచ్చబడ్డది. విపరీతంగా పంట దిగుబడి పెరిగింది. రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ఇంకా వారి సంక్షేమం కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతి అయ్యేలా చూడాలి. అప్పడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతు లాభాలు గడిస్తారు. అదనంగా పండే పంటను దృష్టిలో ఉంచుకుని మాత్రమే.. నూతనంగా అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందు కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలు ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సటాకె’ వంటి కంపెనీలతో చర్చించినం. వారితో రేపటి నుంచే కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించినం " అని సిఎం కేసీఆర్ తెలిపారు.

ఇది కూడా చదవండి : Telangana Rains Updates: ఏయే జిల్లాల్లో, ఏయే ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News