కాలేజీలకు దసరా సెలవులు పొడిగింపు

కాలేజీలకు దసరా సెలవులు పొడిగింపు

Last Updated : Oct 17, 2018, 03:50 PM IST
కాలేజీలకు దసరా సెలవులు పొడిగింపు

రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు దసరా సెలవులను పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం దసరా సెలవులను పొడిగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

ఇదివరకు దసరా సెలవులు ఈ నెల 18వరకు ఇస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. అయితే సెలవులపై మరోసారి సమావేశమైన బోర్డు ఈ నెల 18 వరకు ఉన్న సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. అక్టోబర్ 19, 20వ తేదీల్లో కూడా కళాశాలలకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ వెల్లడించారు. ఈ నెల 22న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. సెలవు రోజుల్లో కాలేజీలు తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలకు అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 21 వరకు దసరా సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం అక్టోబర్ 17న దుర్గాష్టమి, 18న మహర్నవమి, 19న విజయదశమి పర్వదినాలు రానున్నాయి. 21వ తేదీన ఆదివారం కావడంతో 22న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి.  

Trending News