బడ్జెట్‌పై నేటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చ

బడ్జెట్‌పై నేటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చ 

Last Updated : Feb 23, 2019, 11:06 AM IST
బడ్జెట్‌పై నేటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చ

హైదరాబాద్‌: బడ్జెట్ సమావేశాలలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశమైంది. శాసన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నేటి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించారు. మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారీతో పాటు ఇటీవల మృతి చెందిన 16 మంది మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటిస్తూ సభ్యులు 2 నిమిషాలపాటు మౌనం పాటించారు. పంచాయతీరాజ్‌, జీఎస్టీ బిల్లులకు సవరణలు చేస్తూ ఇటీవల తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లను బిల్లు రూపంలో ఇవాళ సభలో ప్రవేశపెట్టనున్నారు. 

ఇక నిన్న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌పై ఇవాళ శాసన సభ, శాసన మండలిలో చర్చ జరగనుంది. చర్చ జరిగిన అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సభ్యులు లేవనెత్తిన సందేహాలపై సమాధానం ఇవ్వనున్నారు.

Trending News