మోత్కుపల్లి మాటల ఎఫెక్ట్: టీటీడీపీలో అంతర్మథనం

టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు టీడీపీని ఇబ్బంది పెట్టాయా ?

Last Updated : Jan 20, 2018, 05:59 PM IST
మోత్కుపల్లి మాటల ఎఫెక్ట్: టీటీడీపీలో అంతర్మథనం

తెలంగాణలో టీడీపీనీ టీఆర్ఎస్‌లో విలీనం చేస్తే ఓ పని అయిపోతుందని ఇటీవల తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించడం ఆ పార్టీలో మరోసారి రాజకీయ దుమారానికి తెరలేపిన సంగతి తెలిసిందే. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన రేవంత్ రెడ్డి తర్వాత మళ్లీ తాజాగా మోత్కుపల్లి నర్సింహులు ఈ విధంగా వ్యాఖ్యానించడం టీడీపీని ఆలోచనలో పడేసింది. దీంతో మోత్కుపల్లి వ్యాఖ్యలపై సమాలోచనలు జరిపేందుకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆ పార్టీ సీనియర్‌ నేతలు సమావేశమయ్యారు. 

టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నామానాగేశ్వర‌రావు, గరికపాటి మోహన్ రావు సహా ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో టీడీపీ భవితవ్యంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం.

Trending News