కొడంగల్ నుండే సత్తా చూపిస్తా..!

  

Last Updated : Oct 29, 2017, 08:17 PM IST
కొడంగల్ నుండే సత్తా చూపిస్తా..!

తెలంగాణలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను వ్యతిరేకించే వారినందరినీ ఒకే తాటిపైకి తీసుకురానున్నట్లు, తెలంగాణలో అవినీతి రాజకీయ నాయకులను అడ్డుకునేందుకు ఐక్యతతో పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం నెక్లస్ రోడ్డులో సమావేశం ఉంటుందని తెలిపారు. ఆ సమావేశంలో తన అభిప్రాయాలను, భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తానని పేర్కొన్నారు. తాను మళ్లీ కొడంగల్ నుండే పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలతో సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి వికారాబాద్ పోలీసు స్టేషనుకు వెళ్లి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కనుక, ఇక ప్రభుత్వం తనకు కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవచ్చని తెలిపారు.  దానికి సంబంధించిన లేఖను ఆయన స్టేషను ఆర్‌ఐకి అందించారు. 

Trending News