చైనా సైన్యంతో పోరాడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు (Colonel Santosh Babu) అంతిమ యాత్ర సూర్యాపేట విద్యానగర్లోని ఆయన ఇంటి నుంచి ప్రారంభమైంది. అధికారులు ఆయన పార్థీవదేహంపై త్రివర్ణ పతాకం ఉంచారు. భారీ సంఖ్యలో తరలివచ్చి సంతోష్ బాబుకు తుది నివాళులు అర్పించారు. సైనిక వందనం సమర్పించిన అనంతరం సంతోష్ బాబు మృతదేహాన్ని అంతిమయాత్ర వాహనంలో ఉంచారు. ( Colonel Santosh Babu: మిలిటరీ విమానంలో కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం తరలింపు )
కాగా, కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో సంతోష్ బాబు (Santosh Babu) అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం 50 మందికి మాత్రమే అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి అనుమతిస్తారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులు, సైనికాధికారులు, కొందరు ఉన్నతాధికారులు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ