మల్లు భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ !

మల్లు భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ !

Last Updated : Feb 23, 2019, 12:16 PM IST
మల్లు భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ !

హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సీఎల్పీ చాంబర్‌కి వెళ్లి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకోవాలని భావిస్తున్న క్రమంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాల్సిందిగా కేటీఆర్ కోరారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకన్నా ముందుగా ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్‌ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

శాసనసభలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్యా బలం అధికంగా వున్నందున డిప్యూటీ స్పీకర్‌గా మాజీ మంత్రి టి.పద్మారావు గౌడ్ ఎన్నికకు ఏ అడ్డంకి లేకపోయినా.. ప్రతిపక్షం నుంచి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు గౌడ్‌ ఎన్నికపై సోమవారం అసెంబ్లీలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

Trending News