భువనగిరి కలెక్టరేట్‌లో కలకలం... ఒంటిపై పెట్రోల్ పోసుకుని తండ్రీకొడుకుల ఆత్మహత్యాయత్నం...

Two men suicide attempt at Bhuvanagiri collectorate: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ తండ్రీకొడుకులు కలెక్టర్ ఛాంబర్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 01:25 PM IST
  • భువనగిరి కలెక్టరేట్‌లో కలకలం
  • తండ్రీకొడుకుల ఆత్మాహత్యాయత్నం
  • 20ఏళ్లుగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వని వైనం
భువనగిరి కలెక్టరేట్‌లో కలకలం... ఒంటిపై పెట్రోల్ పోసుకుని తండ్రీకొడుకుల ఆత్మహత్యాయత్నం...

Two men suicide attempt at Bhuvanagiri collectorate: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ తండ్రికొడుకులు కలెక్టర్ ఛాంబర్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నిస్తుండగా అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు ఆలేరు (Aleru) మండలం కొలనుపాకకు చెందిన ఉప్పలయ్య, మహేష్‌లుగా తెలుస్తోంది.

కొలనుపాకలో ఉప్పలయ్య 20 ఏళ్ల క్రితం నాలుగెకరాల భూమిని రూ.6వేలకు కొనుగోలు చేశాడు. కానీ ఇప్పటివరకూ అధికారులు ఆ భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వలేదు. ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఉప్పలయ్య, మహేష్ సోమవారం (డిసెంబర్ 13) భువనగిరి జిల్లా (Telangana) కేంద్రంలోని కలెక్టరేట్ వద్దకు వచ్చారు. కలెక్టర్ ఛాంబర్ వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు. అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకోవడంతో ఇద్దరి ప్రాణాలకు ముప్పు తప్పింది. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉప్పలయ్య, మహేష్‌లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు సమాచారం.

Also Read: Video: రష్మిక ఓ ఊపు ఊపిందిగా... పుష్ప ఈవెంట్‌లో మామూలు పెర్ఫామెన్స్ కాదు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News