KTR: కేసీఆర్ అపోజిషన్‌లో ఉంటేనే డేంజర్.. ఫిబ్రవరి నుంచి రంగంలోకి..: కేటీఆర్

BRS Working President KTR: మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో కంటే.. ప్రతిపక్షంలో ఉంటేనే చాలా డేంజర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫిబ్రవరి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని చెప్పారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 05:32 PM IST
KTR: కేసీఆర్ అపోజిషన్‌లో ఉంటేనే డేంజర్.. ఫిబ్రవరి నుంచి రంగంలోకి..: కేటీఆర్

BRS Working President KTR: అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్ళమేనని అన్నారు. ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనమన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయని అన్నారు. ఇంకా కొన్నిచోట్ల మరికొన్ని కారణాలతో కోల్పోయామని.. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదామన్నారు. 

"మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మా పోరాట పటిమ చూశారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీ కొస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి. కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజరస్. సీఎం అనే రెండు అక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్.. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారు. పార్లమెంట్‌ నియోజక వర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు ఉంటాయి. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్. ప్రతీ రెండు మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఖమ్మం సీటును కచ్చితంగా గెలవాల్సిందే.." అని కేటీఆర్ అన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటిందని.. వచ్చిన తెల్లారినించే వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలాయపన దిశగా అడుగులేస్తోందన్నారు. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైందని విమర్శించారు. ఇదిలాగే కొనసాగే పరిస్థితి ఉందని.. ప్రజల విశ్వాసాన్ని స్వల్ప కాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు. గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది కూడా అదేనని అన్నారు. 1983లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన అనంతర రాజకీయ పరిణామాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్ గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారని గుర్తు చేశారు.

"ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అనంతరం జరిగిన నాటి లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ వాస్తవం మనం మరువగూడదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండదనేది గత నెల రోజుల ఎన్నికల అనంతర పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైంది. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తూ తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఈ దిశగా మనందరం కార్యోన్ముఖులం కావాల్సి ఉంటుంది." మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News