రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డు

రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డు

Last Updated : Sep 23, 2018, 10:42 AM IST
రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డు

దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్‌ గణేశుడి లడ్డూ ఈ ఏడాది భారీ ధర పలికింది. గ్రామ ముఖ్య కూడలి వద్ద జరిగిన బాలాపూర్‌ వినాయకుడి లడ్డు వేలంపాట కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. లడ్డూ వేలం పాటలో వ్యాపార, వాణిజ్య, రాజకీయ ప్రముఖులు, రైతులు పాల్గొన్నారు.

బాలాపూర్‌ లడ్డూ వేలం పాటలో సుమారు 12 మంది భక్తులు పాల్గొనగా.. చివరకు బాలాపూర్ మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు తెనేటిపల్లి శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నాడు. కాగా 1994 నుంచి బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం పాట నిర్వహిస్తున్నారు. 1994లో బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ రూ.450తో ప్రారంభమైంది. గత ఏడాది బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ రూ.15.60 లక్షలు పలికింది.

లడ్డూ వేలంపాట పూర్తవడంతో బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.

Trending News