Ayodhya Pran Pratishtha: గుడిలో బండలు తుడిచిన కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

Ayodhya Pran Prathistha: అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట ఉత్సవం సందర్భంగా ప్రపంచ నలుమూలల్లోని ఆలయాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. రామయ్య ఆలయ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆలయాలు శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఆలయాలను శుద్ధి చేయగా.. తాజాగా తెలంగాణ గవర్నర్‌ కూడా ఆ క్రతువులో పాలుపంచుకున్నారు. అస్సాంలో తేజాపూర్‌ మహాభైరవ్‌ ఆలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సందర్శించి ఆలయ శుద్ధిలో పాల్గొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 05:33 PM IST
Ayodhya Pran Pratishtha: గుడిలో బండలు తుడిచిన కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

Temple Cleanliness: హైదరాబాద్‌లోని ఆలయంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బండలు తుడిచారు. బకెట్లో నీళ్లు వేసుకుని బండలు తుడిచే కర్ర పట్టుకుని ఆలయమంతా శుభ్రం చేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు గవర్నర్‌ ఆలయ శుద్ధిలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని హనుమాన్‌ ఆలయాన్ని గవర్నర్‌ సందర్శించారు. ప్రతి శనివారం ఆమె ఈ ఆలయాన్ని తప్పనిసరిగా సందర్శిస్తారు. స్వచ్ఛత అనంతరం గవర్నర్‌ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య ప్రాణప్రతిష్ట కోసం ఆమె ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

అయోధ్య ఆలయ తలుపులు హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని టిండర్‌ డిపో వారు తయారు చేయగా.. అక్కడికి గవర్నర్‌ వెళ్లారు. తలుపులను పరిశీలించి అక్కడ పూజలు చేసిన విషయం తెలిసిందే. 'హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్న హనుమాన్ దేవాలయం లో స్వచ్ఛత అభియాన్ నిర్వహించాను. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేవాలయంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించాము' అని గవర్నర్‌ తమిళిసై 'ఎక్స్‌'లో పోస్టు చేశారు. కాగా ప్రాణ ప్రతిష్ట ఉత్సవానికి తమిళిసై కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆమె పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
 

అస్సాంలో అమిత్‌ షా
అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాని మోదీ ఓ పిలుపు ఇచ్చారు. ఆలయాలను పరిశుభ్రం చేయాలని.. ఇందులో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనాలని సూచించారు. అందులో భాగంగానే గవర్నర్‌  ఆలయాన్ని శుభ్రం చేశారు. ఇక అస్సాంలోని తేజాపూర్‌ మహాభైరబ్‌ ఆలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సందర్శించారు. మొదట నీళ్లు చల్లి అనంతరం తుడిచారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ నాసిక్‌లోని కాలరామ్‌ ఆలయంలో స్వయంగా శుభ్రం చేసి 'ఆలయ శుద్ధి' కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Also Read Buy to Bike with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..

Also Read TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News