నెలాఖరులోగా పన్ను చెల్లిస్తే 5శాతం రాయితీ

ఏప్రిల్1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకానుంది. 

Last Updated : Apr 1, 2018, 05:09 PM IST
నెలాఖరులోగా పన్ను చెల్లిస్తే 5శాతం రాయితీ

హైదరాబాద్: ఏప్రిల్1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకానుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల అయిన ఏప్రిల్ చివర్లోగా ఆస్తిపన్ను చెల్లించేవారికి ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) తెలిపింది. ఎర్టీబర్డ్ ఆఫర్‌గా ఈ ప్రక్రియ ఏప్రిల్ నెల చివరి వరకు ఉంటుందని తెలిపింది.

ఎర్లీబర్డ్ ఆఫర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నుకు మాత్రమే వర్తిస్తుంది. ఎటువంటి పాత బకాయిలు లేనివారే ఈ ప్రయోజనం పొందవచ్చని అధికారులు తెలిపారు. సకాలంలో పన్ను చెల్లించే వారికి మేలుచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మేరకు కొత్త ఆర్థిక సంవత్సరం మొదటినెల పన్నులు చెల్లించేవారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. దీన్నే 'ఎర్లీబర్డ్ ఆఫర్‌' గా పిలుస్తున్నారు. ఈ ఆఫర్ ద్వారా ఏటా సుమారు రూ.200 కోట్లకు పైగా పన్ను మొదటి నెలలోనే వసూలు అవుతుందని అన్నారు. ఈ నెలాఖరు వరకు ఆస్తి పన్నులు చెల్లించేవారికి రాయితీ వర్తింపజేసే విధంగా సీజీజీ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నారు. కాగా జీహెచ్ఎంసీలో కొన్నేళ్లుగా వసూలు కాకుండా పేరుకుపోయిన ఆస్తిపన్ను మొండిబకాయిలు రూ.1240.79 కోట్లు ఉండటం గమనార్హం.

Trending News