కరీంనగర్ : కరోనావైరస్ ( Coronavirus ) సోకిందని తెలిసిన తర్వాత కూడా ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి మరో పది మందితో కలిసి పేకాట ఆడిన వైనం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని వల్బాపూర్లో చోటుచేసుకుంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus positive ) అనే వార్త నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్లో చేర్పించారు.
దర్శకుడు తేజకి (Director Teja) కరోనా పాజిటివ్గా తేలింది. ఇటీవల జరిగిన ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో డైరెక్టర్ తేజ పాల్గొన్నాడు. ఈ షూటింగ్ అనంతరం యూనిట్ సభ్యుల్లో ఒకరికి కొద్దిపాటి కరోనా లక్షణాలు ( Coronavirus symptoms) కనిపించినట్టు తెలుస్తోంది.
తిరువనంతరపురం : కరోనావైరస్ ( Coronavirus pandemic ) వ్యాప్తి నివారణకు సహకరించాల్సిందిగా ప్రభుత్వాలు చేస్తోన్న విజ్ఞప్తుల పట్ల జనం ఎక్కడైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో... అక్కడ కరోనావైరస్ మరింత విజృంభిస్తోంది.
కరోనాతో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 96 శాతం జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలలో ఏదైనా ఒకటి (Corona Symptoms) ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది.
Guduru Narayana Reddy | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి ప్రజాప్రతినిధులను వణికిస్తోంది. ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనావైరస్ బారిన పడి కోలుకుంటుండగా.. తాజాగా టీపీసీసీ ట్రెజరర్ గూడూరు నారాయణ రెడ్డికి కూడా కరోనావైరస్ ( Coronavirus positive) సోకింది.
COVID-19 updates | హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొత్తగా 219 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే 189 కేసులు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్ అర్బన్ జిల్లాలో 4, వరంగల్ రూరల్ -3, మేడ్చల్ జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ లక్షణాలున్న తనకు కోవిడ్ టెస్ట్ చేయండని ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన తన సోదరుడికి పారాసిటమోల్ టాబ్లెట్స్ చేతిలో పెట్టి పంపించారని ఓ యువకుడు శనివారం మీడియా ఎదుట వాపోయాడు. అంతేకాకుండా ఇదే విషయమై ఫిర్యాదు చేద్దామని హెల్ప్ లైన్ నెంబర్స్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అక్కడి నుండి స్పందనే కనిపించలేదంటున్నాడు బాధిత యువకుడి సోదరుడు.
కరోనావైరస్ (Coronavirus) లాంటి మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు అందరూ ముఖానికి మాస్కులు, చేతులకు గ్లోవ్స్ ధరిస్తున్నారు. మాస్కులు, గ్లోవ్స్ ధరించడం ద్వారా కరోనావైరస్ వ్యాపించకుండా అడ్డుకోవచ్చనే ఉద్దేశంతోనే అందరూ ఆ పద్దతిని అనుసరిస్తున్నారు. కానీ కొంతమంది నిపుణులు చెబుతున్న మాట (Experts say on Coronavirus) అందుకు విరుద్ధంగా ఉంది.
కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ దేశం.. ఆ దేశం అని మినహాయింపు లేకుండా ప్రపంచదేశాలన్నీ కరోనా బారినపడుతున్నాయి. వైరస్ ఆధారిత జబ్బు కావడంతో ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా కరోనావైరస్కి చేరువ చేస్తోంది.
కరోనావైరస్ భూతం యావత్ ప్రపంచాన్ని ఒక విషయంలో ఏకం చేస్తోంది. అవును.. ప్రాంతం, మతం అంటూ ఒకదేశానికి మరో దేశానికి మధ్య పరస్పర బేధాభిప్రాయాలున్నా.. దేశాల మధ్య అంతర్యుద్ధాలున్నా.. కరోనా విషయంలో మాత్రం అన్ని దేశాలకు ఒక్కటే శత్రువు. అదే కరోనావైరస్. ఆ కరోనా వైరస్ని ఎదుర్కునేందుకు యావత్ ప్రపంచ దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఏయే దేశాలు ఎలా సన్నద్ధం అవుతున్నాయో ఈ వీడియో ద్వారా చూద్దాం.
ఏపీ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖపట్నంలో మార్చి 18-28 వరకు జరగనున్న మిలాన్ మల్టీలేటెరల్ నావల్ ఎక్సర్సైజ్పై కరోనావైరస్ ప్రభావం పడింది. 40 దేశాలు పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.