WATCH: పానీపురి వాలాగా మారిన ధోనీ

మాజీ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) ఆర్పి సింగ్, పియుష్ చావ్లా కోసం పానీపురి వాలాగా అవతారం ఎత్తాడు.

Last Updated : Aug 30, 2020, 10:16 PM IST
    • మాజీ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్పి సింగ్, పియుష్ చావ్లా కోసం పానీపురి వాలాగా అవతారం ఎత్తాడు.
    • దానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
WATCH:  పానీపురి వాలాగా మారిన ధోనీ

మాజీ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) ఆర్పి సింగ్, పియుష్ చావ్లా కోసం పానీపురి వాలాగా అవతారం ఎత్తాడు. దానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటిది కాదు. ఫిబ్రవరి నాటిది. చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) కెప్టెన్ ధోని ఒక ఈవెంట్ లో భాగంగా మాల్దీవ్స్ వెళ్లినప్పుడు తన టీమ్ సభ్యులకు పానీపూరి అందించాడు.

ఇటీవలే ఇద్దరు చెన్నై ప్లేయర్స్ కు కోవిడ్-19 ( Covid-19 ) సోకింది. దాంతో యూఏఈలో జరగనున్న ఐపిఎల్ సీజన్13కు ముందు వీరు కొంత కాలం ఐసోలేషన్ లో ఉండనున్నారు. ఈ టైమ్ లో ధోనీ పానీపూరి వాలా అవతారం ఎత్తిన వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది. 

ఒక పానీపూరి స్టాండ్ వద్దకు చేరిన టీమ్ ఇండియా ( Team India ) ప్లేయర్లకు ధోనీలో ఉన్న మల్టీ ట్యాలెంట్ ను చూసే అవకాశం దొరికింది. మాల్దీవ్స్ నుంచి ఈ వీడియోను ( Viral Video ) మీరు చూడండి...ఇందులో రాక్ స్టార్స్ పానీపూరి ఎలా సిద్ధం చేస్తున్నారో చూడండి. మనకు ఇష్టమైన చాట్ మరింత రుచికరంగా మారింది అని పోస్ట్ చేశారు ధోనీ ఫ్యాన్స్. ధోనీ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోనీతో పాటే రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Trending News