IPL 2022: ఆ రెండు కొత్త ఫ్రాంచైజీల తొలి మ్యాచ్ ఇవాళే

IPL 2022: క్రికెట్ ప్రేమికుల్ని ఊరించిన ఐపీఎల్ 2022 ప్రారంభమైంది. ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రెండు ఫ్రాంచైజీల తొలి మ్యాచ్ ఇవాళ జరగనుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2022, 08:35 AM IST
IPL 2022: ఆ రెండు కొత్త ఫ్రాంచైజీల తొలి మ్యాచ్ ఇవాళే

IPL 2022: క్రికెట్ ప్రేమికుల్ని ఊరించిన ఐపీఎల్ 2022 ప్రారంభమైంది. ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రెండు ఫ్రాంచైజీల తొలి మ్యాచ్ ఇవాళ జరగనుంది. 

ఐపీఎల్ 2022 పోటీలు ప్రారంభమై అప్పుడే రెండ్రోజులవుతోంది. ఇవాళ మూడవరోజు కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2022లో ఈసారి కొత్తగా రెండు ఫ్రాంచైజీలు అడుగుపెట్టాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్. ఈ రెండు జట్లకు ఐపీఎల్ తొలి మ్యాచ్..వీటి మద్యే జరగనుండటం విశేషం. ముంబైలోని వాంఖడే స్డేడియంలో సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగనుంది. 

గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా నేతృత్వం వహిస్తుండగా..లక్నో సూపర్ జెయింట్స్‌కు కేఎల్ రాహుల్ సారధ్యం వహించనున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టులో శుభమన్ గిల్, మాధ్యూవేడ్, వృద్ధిమాన్ సాహా, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, లాకీ ఫెర్గూసన్, మొహమ్మద్ షమీ ఉన్నారు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ తరపున కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, మనీష్ పాండే, దీపక్ హుడా, మనన్ వోహ్రా, కృనాల్ పాండ్యా, అంకిత్ రాజ్‌పుత్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, షాబాజ్ నదీమ్ ఉన్నారు. 

Also read: : PBKS vs RCB: డుప్లెసిస్ వీర బాదుడు... పంజాబ్‌కు భారీ టార్గెట్ సెట్ చేసిన ఆర్సీబీ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News