Venus Transit 2024: ఏడాది తర్వాత శని రాశిలోకి శుక్రుడు..ఇక ఈ రాశులవారికి కనక వర్షమే..

Venus Transit 2024: ఏడాది తర్వాత శుక్ర గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం వరించబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 26, 2024, 11:34 AM IST
Venus Transit 2024: ఏడాది తర్వాత శని రాశిలోకి శుక్రుడు..ఇక ఈ రాశులవారికి కనక వర్షమే..

 

Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం వ్యక్తుల జాతకాల్లో శుభ స్థానాల్లో ఉంటే సంపాదన, ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అందుకే ఈ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో ఆనందం, శ్రేయస్సు, లగ్జరీ, ప్రేమకు సూచికగా భావిస్తారు. అయితే ఈ శుక్రగ్రహం కేవలం కొన్ని సమయాల్లో మాత్రమే సంచారం చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరంలోని మొదటి సారిగా మార్చి నెలలో శుక్రుడు కుంభరాశిలోకి  సంచారం చేయబోతున్నాడు. 1 సంవత్సరం తర్వాత శని రాశిగా పరిగణించే కుంభ రాశిలోకి శుక్రుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కుంభ రాశి:
శుక్రుడి సంచారం కుంభరాశిలోనే జరబోతోంది. కాబట్టి ఈ రాశివారిపై సానుకూల ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. దీంతో పాటు వైవాహిక జీవితంలో శృంగారం సమయం పెరుగుతుంది. అంతేకాకుండా ఒంటరిగా ఉన్న వ్యక్తులకు వివాహాలు కూడా జరుగుతాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

వృషభ రాశి:
శుక్రుని సంచారం కారణంగా వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారాల్లో లాభాలు పొందడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల్లో మార్పులు వచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక ఆరోగ్యం పట్ల ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తలు, కళ, మీడియా రంగాల్లో పనులు చేస్తున్నవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

తులారాశి:
ఏడాది తర్వాత శుక్రుడు కుంభరాశిలోకి సంచారం చేయడం కారణంగా తులారాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు పూర్వీకుల  నుంచి కూడా ఆస్తులను పొందుతారు. అంతేకాకుండా ఈ రాశివారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తారు. కాబట్టి వీరిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు కూడా పొందుతారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News