Green Chillies in Private Parts: బలవంతంగా మూత్రం తాగించి, బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్స్‌లో పచ్చిమిరపకాయలు

Green Chillies Inserted in Minors' Private Parts: లక్నో : దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు మైనర్ల చేతులు, కాళ్లు కట్టేయడమే కాకుండా వారిని బట్టలు విప్పేసి వారి చేక బలవంతంగా మూత్రం తాగించిన ఘటన ఇది. అంతటితో ఆగని ఆ దుర్మార్గుల అరాచకం.. ఆ మైనర్ల ప్రైవేటు పార్ట్స్‌లో పచ్చిమిరపకాయలు పెట్టి హింసించే వరకు వెళ్లింది.

Written by - Pavan | Last Updated : Aug 7, 2023, 11:27 AM IST
Green Chillies in Private Parts: బలవంతంగా మూత్రం తాగించి, బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్స్‌లో పచ్చిమిరపకాయలు

Green Chillies Inserted in Minors' Private Parts: లక్నో : దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు మైనర్ల చేతులు, కాళ్లు కట్టేయడమే కాకుండా వారిని బట్టలు విప్పేసి వారి చేక బలవంతంగా మూత్రం తాగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. అంతటితో ఆగని వారి అరాచకం.. ఆ మైనర్ బాలుర ప్రైవేట్ పార్ట్స్ లో పచ్చి మిరపకాయలు పెట్టి వేధించే వరకు వెళ్లింది. చోరీ చేశారో లేదో కూడా తేలియకుండానే కేవలం అనుమానంతోనే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ అభంశుభం తెలియని ఇద్దరు మైనర్ బాలురపై అరాచకానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అందుకు బాధ్యులైన ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

టైమ్స్ నౌ వార్తా కథనం ప్రకారం... ఇద్దరు మైనర్ బాలురపై దాడికి పాల్పడమే కాకుండా వారి ప్రైవేట్ పార్ట్స్ లో పచ్చి మిరపకాయలు కూడా పెట్టి థర్డ్ డిగ్రీ కంటే దారుణంగా హింసించినట్టు తెలుస్తోంది. ఇద్దరు మైనర్లను శారీరంగా హింసించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఆ వీడియో మరీ అభ్యంతరకరంగా ఉండటమే కాకుండా అది ఆ మైనర్ల హక్కులకు భంగం కలిగించేలా ఉన్న కారణంగా ఆ వీడియోను ఇక్కడ మేం పోస్ట్ చేయడం లేదు.

 

సిద్ధార్థనగర్ జిల్లా ఏఎస్పీ సిద్ధార్థ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ, " సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుండటంతో ఠాణా పత్ర బజార్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తమ దృష్టికి వచ్చింది " అని తెలిపారు. అరెస్ట్ అయిన ఆరుగురిపై ఇండియన్ పీనల్ కోడ్, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సిద్ధార్థ స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి : Man killed his Childhood Friend: ఇంటికొచ్చిన స్నేహితుడిని చంపి పాతిపెట్టాడు

ఇద్దరు మైనర్లపై అరాచకానికి పాల్పడిన దుండగులపై సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఆ ఇద్దరు మైనర్లు అసలు చోరీ చేశారో లేదో కూడా తెలియకుండానే ఇంతటి పైశానికి పాల్పడుతారా అని నెటిజెన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు... ఒకవేళ నిజంగానే ఆ ఇద్దరు మైనర్లు తప్పు చేసే వారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు, న్యాయ వ్యవస్థ ఉంది కానీ వీళ్లు మరీ ఇంత దుర్మార్గానికి పాల్పడటానికి వీళ్లెవరు ? ఒకవేళ ఈ ఘటన వల్ల పరువు పోయిందన్న ఆత్మన్యూనతా భావంతో ఆ మైనర్లు కానీ లేదా వాళ్ల కుటుంబాలు కానీ ఏమైనా చేసుకుంటే అందుకు ఎవరు బాధ్యులు అని నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Constable Murder Case: భార్య చేతిలో కానిస్టేబుల్ దారుణ హత్య.. ప్రాణం తీసిన అక్రమ సంబంధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News