కృష్ణ నది ప్రమాదంపై ట్వీట్ చేసిన పవన్

   

Last Updated : Nov 13, 2017, 05:57 PM IST
కృష్ణ నది ప్రమాదంపై ట్వీట్ చేసిన పవన్

జనసేన పార్టీ అధ్యక్షుడు కృష్ణ నది పడవ ప్రమాదంపై ట్విట్టర్ లో స్పందించారు. ఆ ప్రమాదంలో మరణించిన ఒంగోలు, నెల్లూరు వాసుల పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న తాను ఈ విషయాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా విన్నారని, చిన్న చిన్న నిర్లక్ష్యాలకు విలువైన ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని ఆయన తెలియజేశారు. వారి కుటుంబానికి జరిగిన లోటును పూడ్చేలేమని, మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అని అన్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా మనుషుల ప్రాణాలు విలువైనవి అని గుర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకొక సారి ఇలాంటి సానుభూతి ప్రకటన చేయకుండా ఉండేందుకు... ఇలాంటి విషయాల పట్ల ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తను కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం పవన్ తన 25 వ చిత్ర షూటింగ్‌లో ఉన్నారు. 

 

 

Trending News