PM Modi: లక్షదీవుల్లో ప్రధాని మోదీ స్నార్కెలింగ్‌ సాహసం.. నెట్టింట పిక్స్ వైరల్‌

PM Narendra Modi Lakshadweep Trip Pics: లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సందడి చేశారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. సముద్రం ఒడ్డున కూర్చుని సేద తీరారు. సముద్రంలో స్నార్కెలింగ్ కూడా చేస్తూ.. సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం. ప్రధాని మోదీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

  • Jan 04, 2024, 18:23 PM IST
1 /5

లక్షదీవుల సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి తానింకా ఆశ్యర్యంలో ఉన్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఈ దీవులు మంత్రముగ్ధులను చేస్తున్నాయంటూ రాసుకొచ్చారు.  

2 /5

140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం తాను మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం తనకు నేర్పిందని చెప్పుకొచ్చారు.   

3 /5

సాహసాలు చేయాలనుకునేవారు మీ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని సూచించారు.  

4 /5

గత రెండు రోజులుగా కేరళ, తమిళనాడు, లక్షద్వీప్‌లలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. లక్షద్వీప్‌లోని సముద్ర తీరంలో షికారు చేశారు.   

5 /5

తాను స్నార్కెలింగ్‌ని కూడా ప్రయత్నించానని.. అది ఎంత ఆనందదాయకమైన అనుభవమని అన్నారు.