Chandrababu naidu: చంద్రబాబుకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలను ఆఫర్ చేసిన ప్రధాని మోదీ..

Loksabha election results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలలో ప్రజలు ఊహించని తీర్పును  ఇచ్చారు. ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీకూడా ఖరారు అయిపోయింది.

1 /6

దీనిపై చంద్రబాబు కొంత సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ రోజు రాత్రి అమరావతిలో చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చంద్రబాబు మోదీ ఆఫర్ పట్ల ఏవిధంగా స్పందిస్తారో అనేది కీలకంగా మారింది.

2 /6

ఏపీలో ప్రజలు ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో వినూత్నంగా తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్సీర్సీపీని చిత్తు చిత్తూగా ఓడించారు. అధికార వైఎస్సార్సీపీ కి చెందిన  మంత్రులు, కీలక నేతలు ఓటమిని చవిచూశారు. ఏకంగా వైస్సార్పీపీ 8 జిల్లాలో కనీసం ఖాతాతెరవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

3 /6

గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయనగరం, నెల్లూరు జిల్లాలను క్లీన్ స్వీప్ చేయగా.. ఈ ఎన్నికలల మాత్రం కనీసం ఖాతా కూడా తెరవలేదు. దీంతో సీఎం జగన్ ఇప్పటి వరకు వైనాట్ 175 అంటూ ప్రజల్లోకి వెళ్లారు.. కానీ సీఎం జగన్ మాత్రం ఊహించని ఫలితాలు ప్రస్తుతం వెలువడ్డాయి.

4 /6

ఇక కేంద్రంలో.. బీజేపీ 400 టార్గెట్ గా ఎన్నికల బరిలో నిలిచింది.. కానీ అనూహ్యంగా బీజేపీకి 250 సీట్ల వరకు ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో బీజేపీకి, చంద్రబాబు అవసరం ఏర్పడింది. ఇదిలా ఉండగా గతంలో వాజ్ పేయ్ హయాంలో..చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. 

5 /6

దీంతో ఈసారి చంద్రబాబుకు మరోసారి ఎన్డీయే కన్వీనర్ పదవిని హోమంత్రి, అమిత్ షా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోదీ చంద్రబాబుకు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. 

6 /6

పీఎం మోదీకి భారీ మెజార్టీ రాని  నేపథ్యంలో.. చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేకు కీలకంగా మారింది. ఎన్డీయేకు గతంలో చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నఈ నేపథ్యంలో.. పాత వైరాన్ని పక్కనపెట్టి, మోదీ చంద్రబాబు సపోర్ట్ ను అడిగినట్లు తెలుస్తోంది.