కాలేజీ నిర్లక్ష్యానికి బలైపోయిన నిండు ప్రాణం

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఓ విద్యాసంస్థ ధనదాహానికి ఓ నిండు ప్రాణాన్ని బలైపోయింది.

Last Updated : May 12, 2018, 03:39 PM IST
కాలేజీ నిర్లక్ష్యానికి బలైపోయిన నిండు ప్రాణం

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఓ విద్యాసంస్థ ధనదాహానికి ఓ నిండు ప్రాణాన్ని బలైపోయింది. పరీక్షకు అనుమతించకపోవడంతో ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. రామకృష్ణ కాలేజీలో మోహన్‌లాల్(20) అనే విద్యార్థి డిగ్రీ చదువుకుంటున్నాడు. కాలేజీ ఫీజు కింద రూ.25,700లు యాజమాన్యానికి చెల్లించాడు. మిగిలిన రూ.300లు చెల్లించలేదు. దీంతో సదరు విద్యార్థిని విద్యాసంస్థ యాజమాన్యం పరీక్షలు రాయడానికి  అనుమతించలేదు. హాల్ టికెట్ కూడా ఇవ్వలేదు. పరీక్షకు అనుమతించకపోతే విద్యా సంవత్సరాన్ని కోల్పోతానని మోహన్‌లాల్ తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు. దీంతో బాధితుడి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థులు కాలేజీ ఎదుట నిరసనకు దిగారు. కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Trending News