karnataka: సీఎం యడియూరప్ప కుమార్తెకూ కరోనా..

దేశంలో కరోనావైరస్  ( Coronavirus ) విజృంభణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు.

Last Updated : Aug 3, 2020, 12:41 PM IST
karnataka: సీఎం యడియూరప్ప కుమార్తెకూ కరోనా..

Yediyurappa's daughter tested Corona positive: బెంగళూరు: దేశంలో కరోనావైరస్  ( Coronavirus ) విజృంభణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే.. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప  ( BS yediyurappa ) కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కుమార్తె ( Yediyurappa's daughter ) కు కూడా కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. యడియూరప్పకు కరోనా సోకిందని తెలిసిన వెంటనే.. ఆయన కుటుంబసభ్యులు, సిబ్బందికి కరనా పరీక్షలు చేశారు. దీంతో ఆయన కుమార్తెకు కూడా కరోనా సోకినట్లు నిర్థారించారు. Also read: karnataka: సీఎం యడియూరప్పకు కరోనా

దీంతో సీఎం కుమార్తెను ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం సీఎం అధికారిక నివాసంలోని ఉద్యోగులకు కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమై అందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇదిలాఉంటే.. సీఎం యడియూరప్ప తనను కలిసిన వారందరినీ క్వారంటైన్‌లో ఉండాలని ఇప్పటికే సూచించారు.  Also read; Covid19: కేంద్రమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

Trending News