అరుదైన ఫోటో పోస్ట్ చేసిన కిరణ్ బేడీ

          

Last Updated : Nov 20, 2017, 02:28 PM IST
అరుదైన ఫోటో పోస్ట్ చేసిన కిరణ్ బేడీ

భారత తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి, ప్రస్తుత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ట్విట్టర్ లో ఫోటోను పోస్ట్ చేశారు. దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీతో దిగిన అరుదైన ఫోటో అది. 1975వ సంవత్సరంనాటి ఈ ఫోటోను కిరణ్ బేడీ శ్రీమతి ఇందిరాగాంధీ శతజయంతి సందర్భంగా పోస్ట్ చేసినట్లు తెలిపారు. 

ఇందిరా గాంధీ అంటే తనకెంతో అభిమానమని.. ఇందిరా గాంధీ కూడా తననెంతో అభిమానించేవారని పేర్కొన్నారు. తనను తరచూ వారి నివాసానికి ఆహ్వానించేవారని.. తెలిసిన వారికి నన్ను మొదటి ఐపీఎస్ అధికారిణి అంటూ పరిచయం చేసేవారని గుర్తు చేసుకున్నారు. 

 

Trending News