6వ విడత లోక్ సభ బరిలో నిలిచిన ప్రముఖుల జాబితా

6వ విడత లోక్ సభ బరిలో నిలిచిన ప్రముఖుల జాబితా

Last Updated : May 12, 2019, 05:33 PM IST
6వ విడత లోక్ సభ బరిలో నిలిచిన ప్రముఖుల జాబితా

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేటి 6వ విడత పోలింగ్‌ జరుగుతున్న లోక్ సభ స్థానాల నుంచి అధికార, విపక్షాల నుంచి పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, మేనకా గాంధీ, హర్షవర్థన్ ఈ విడత ఎన్నికల్లోనే పోటీ చేస్తున్నారు. వీళ్లే కాకుండా మనోజ్ తివారి, మీనాక్షి లేఖి, గౌతం గంభీర్, ప్రముఖ పంజాబీ ఫోక్ సింగర్ హన్స్ రాజ్ హన్స్ వంటి వారు కూడా ఈ విడత ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రముఖుల జాబితాలో వున్నారు.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ నుంచి నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలవగా, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్ సభ స్థానం నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ పోటీచేస్తున్నారు. భోపాల్‌లో బీజేపి అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా సింగ్ థాకూర్, దిగ్విజయ్ సింగ్ మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉంది. జ్యోతిరాదిత్య సింథియా (గుణ లోక్ సభ స్థానం), మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ వంటి వారు సైతం కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్నారు. 

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీచేస్తున్న అజంఘడ్ లోక్ సభ స్థానం సైతం ఇదే విడతలో పోలింగ్‌ జరగనుంది. 2014 ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ గెలిచిన స్థానం నుంచే ఈసారి అఖిలేష్ యాదవ్ పోటీచేస్తున్నారు.

Trending News