Sadhvi Saraswati: గోరక్షణకు హిందువులు ఖడ్గాలు చేతపట్టండి-వీహెచ్‌పీ నేత సంచలన వ్యాఖ్యలు

VHP leader Sadhvi Saraswati sensational comments:  హిందువులంతా ఖడ్గాలు చేతపట్టి కుటుంబ రక్షణతో పాటు గోరక్షణకు పూనుకోవాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) నేత సాధ్వి సరస్వతి పిలుపునిచ్చారు. లక్షల రూపాయల డబ్బును ఫోన్ల కోసం, వ్యక్తుల కోసం వెచ్చించే బదులు ఖడ్గాలు, ఇతర ఆయుధాలు కొనుగోలు చేసేందుకు వెచ్చించాలని పేర్కొన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 03:52 PM IST
  • వీహెచ్‌పీ నేత సాధ్వి సరస్వతి సంచలన వ్యాఖ్యలు
  • హిందువులు ఖడ్గాలు కొనుగోలు చేయాలని పిలుపు
  • గోరక్షణకు ఖడ్గాలు చేతపట్టాలన్న సాధ్వి సరస్వతి
 Sadhvi Saraswati: గోరక్షణకు హిందువులు ఖడ్గాలు చేతపట్టండి-వీహెచ్‌పీ నేత సంచలన వ్యాఖ్యలు

Sadhvi Saraswati sensational comments: హిందువులంతా ఖడ్గాలు చేతపట్టి కుటుంబ రక్షణతో పాటు గోరక్షణకు పూనుకోవాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) నేత సాధ్వి సరస్వతి (Sadhvi Saraswati) పిలుపునిచ్చారు. లక్షల రూపాయల డబ్బును ఫోన్ల కోసం, వ్యక్తుల కోసం వెచ్చించే బదులు ఖడ్గాలు, ఇతర ఆయుధాలు కొనుగోలు చేసేందుకు వెచ్చించాలని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

'ప్రపంచమంతా గోమాతను ఆరాధిస్తోంది. కానీ కర్ణాటకలో (Karnataka) మాత్రం మాంసం కోసం గోహత్య జరుగుతోంది. గోవులను చంపేవారికి ఈ దేశంలో ఉండే హక్కు లేదు. ఆయుధాలతో బెదిరించి గోశాలల నుంచి ఆవులను ఎత్తుకెళ్తున్నారు. కాబట్టి మనమంతా ఖడ్గాలు చేతపట్టి గోరక్షణకు పూనుకోవాలి.' అని సాధ్వి సరస్వతి పిలుపునిచ్చారు.

లక్షల రూపాయలు పెట్టి సెల్‌ఫోన్లు కొనుగోలు చేసే స్తోమత ఉన్నవారు... గోరక్షణ కోసం (Protectin of Cows) ఆయుధాలు కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోగలరని అన్నారు. తద్వారా గోమాతను రక్షించుకోగలరని... గోహత్యలు జరగకుండా అడ్డుకోగలరని అన్నారు. తాను పుట్టింది గోశాలలోనే అని... గో సంరక్షణ తన బాధ్యత అని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం, గోహత్య నివారణ జరగాలని పుట్టుకతోనే తాను తీర్మానించుకున్నానని సాధ్వి తెలిపారు.

కర్ణాటకలో (Karnataka) కొంతమంది దేశ ద్రోహులు టిప్పు సుల్తాన్‌ను కొనియాడుతున్నారని... వారికి వ్యతిరేకంగా నిరసన చేయాలని సాధ్వి పేర్కొన్నారు. గోహత్య నివారణకు, లవ్ జిహాదీని అడ్డుకోవడానికి కఠినమైన చట్టాలు తీసుకురావాలన్నారు. 'ఇక్కడి ప్రతీ ప్రాణం దేవుడి బిడ్డలేనని భగవద్గీత చెబుతోంది. భారత మాత మన మాతృ భూమి. కాబట్టి గోహత్యలు చేసేవారికి, లవ్ జిహాదీలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి.' అని సాధ్వి చెప్పుకొచ్చారు.

Also Read: Rashmika dance : రష్మిక మందన్నా డ్యాన్స్ ఇరగదీసింది.. షార్ట్‌ హాట్ ప్యాంట్‌తో సామీ సామీ సాంగ్‌కు స్టెప్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News