Omicron cases: దేశంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు- 25కు చేరిన మొత్తం సంఖ్య!

దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గుజరాత్​లో మరో రెండు ఒమిక్రాన్​ వేరియంట్ (Omicron cases in Gujarat) కేసులు బయటపడ్డాయి. గుజరాత్​లో తొలుత ఒమిక్రాన్​ సోకినట ఎన్​ఆర్​ఐని కలిసిన (ఒమిక్రాన్​ సోకినట్లు గుర్తించకముందు) మరో ఇద్దరు వ్యక్తులకు శక్రవారం పాజిటివ్​గా తేలింది. దీనితో గుజరాత్​లో ఒమిక్రాన్​ కేసుల (Total Omicron cases in Gujarat) సంఖ్య మూడుకు చేరింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 04:44 PM IST
  • దేశంలో ఒమిక్రాన్ భయాలు
  • గుజరాత్​లో మరో ఇద్దరికి పాజిటివ్​
  • ఆ రాష్ట్రంలో మొత్తం 3 కేసులు
Omicron cases: దేశంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు- 25కు చేరిన మొత్తం సంఖ్య!

Omicron cases rising in India: దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గుజరాత్​లో మరో రెండు ఒమిక్రాన్​ వేరియంట్ (Omicron cases in Gujarat) కేసులు బయటపడ్డాయి. గుజరాత్​లో తొలుత ఒమిక్రాన్​ సోకినట ఎన్​ఆర్​ఐని కలిసిన (ఒమిక్రాన్​ సోకినట్లు గుర్తించకముందు) మరో ఇద్దరు వ్యక్తులకు శక్రవారం పాజిటివ్​గా తేలింది. దీనితో గుజరాత్​లో ఒమిక్రాన్​ కేసుల (Total Omicron cases in Gujarat) సంఖ్య మూడుకు చేరింది.

ఇక దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య (Total Omicron cases in India) 25కు చేరింది. అధికారిక లెక్కల ప్రకారం.. గత గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు.

ప్రస్తుతం గుజరాత్​లో ఉన్న ముగ్గురు.. (మిక్రాన్​ సోకిన వ్యక్తులు) ఆరోగ్యంగానే ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వారికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు తెలిపాయి. వారికి ప్రస్తుతం వైద్యం కొనసాగుతుందని వివరించాయి.

గుజరాత్​లో మొదటి కేసు ఇలా..

గుజరాత్​లో మొదటి ఒమిక్రాన్ కేసు గత వారం నమోదైంది. జింబాంబ్వే నుంచి వచ్చిన ఓ 72 ఏళ్ల ఎన్​ఆర్​ఐకి కొవిడ్ ఒమిక్రాన్​ వేరియంట్ సోకినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు వెంటనే అతనితో సన్నిహితంగా ఉన్న వారిని క్వారెంటైన్​కు తరలించారు.  వారిలోనే తాజాగా ఇద్దరు వ్యక్తులకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది.

దేశవ్యాప్తంగా ఇలా..

దేశవ్యాప్తంగా కర్ణాటకలో తొలుత రెండు ఒమిక్రాన్ కేసులు (Omicron fears in India) బయటపడ్డాయి.  ప్రస్తుతం మహారాష్ట్ర, రాజస్థాన్​, గుజరాత్​, ఢిల్లీల్లో ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి.

ఒమిక్రాన్ దేశంలోకి ప్రవేశించిన నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి. మాస్క్ పెట్టుకోవడం, టీకా వేయించుకోవడం తప్పనిసరి చేస్తున్నాయి. టీకా లేకుంటే షాపింగ్ మాల్స్​కు, ధియేటర్లకు వచ్చేందుకు అనుమతి ఇవ్వొద్దనే ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు టీకా వేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

Also read: అమానవీయం: బస్సు నుంచి ఆ ఫ్యామిలీని బలవంతంగా దింపేశారు-వీడియో వైరల్

Also read: Bird Flu Cases in Kerala: కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. అలప్పుజ జిల్లాలో వాటిపై నిషేధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News