Srinagar: ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

సరిహద్దులో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ ఎన్‌కౌంటర్ ఘటన (Srinagar Encounter)‌లో ఓ పోలీసు సైతం అమరుడయ్యారు.

Last Updated : Aug 30, 2020, 07:59 AM IST
Srinagar: ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని పంథా చౌక్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు, పోలీసులపై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో దీంతో ఎదురుకాల్పులు జరిపి, ఆపై చేసిన ఎన్‌కౌంటర్ (Srinagar Encounter)‌లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు అమరుడయ్యారని వెల్లడించారు. Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధరలు 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!

ఉగ్రవాదుల కదలికలను గుర్తించి వారి కోసం భద్రతా బలగాలు అన్వేషిస్తుండగా ఒక్కసారిగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఎన్‌కౌంటర్ జరిపారు. శనివారం ఒక ఉగ్రవాది హతమయ్యాడని, ఓ ఏఎస్ఐ బాబు రామ్ అమరుడయ్యారని కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. తాజాగా మరో ఇద్దరు ఉగ్రవాదులు శ్రీనగర్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని సమాచారం అందించారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే  
Meera Mitun: నిత్యానంద సేవకు బిగ్ బాస్ భామ రెడీ 
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు 

 

Trending News