Pulwama Encounter: పుల్వామాలో భారీ ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం!

Pulwama Encounter: జమ్ము కశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుధవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి దగ్గర నుంచి రెండు AK 47 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 11:10 AM IST
Pulwama Encounter: పుల్వామాలో భారీ ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం!

Pulwama Encounter: ఉత్తర భారతంలోని జమ్ము కశ్మీర్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామాలో బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమయ్యారు. పుల్వామాలోని మిత్రిగామ్ ప్రాంతంలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. 

ఇందులో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి AK 47 రైఫిళ్లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయాన్ని జమ్ము కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్ లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు అల్ బద్రే ఉగ్రవాద సంస్థకు చెందిన వారని.. ఎజాజ్ హఫీజ్, షాహిద్ అయూబ్ లు గుర్తించినట్లు ఆయన తెలిపారు.  

Also Read: Covid 19 Cases: దేశంలో కొత్తగా 3303 కరోనా కేసులు... మరో 39 మంది మృతి

Also Read: How to Prevent Cyber Crimes: సైబర్ నేరాల నియంత్రణకు అవగాహన కల్పిస్తూ కేంద్రం తీసుకున్న చర్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News