ప్రధాని తరపున డా హర్షవర్థన్, అమిత్ షా తరపున జేపి నడ్డా నివాళి

ఎయిమ్స్ నుంచి నివాసానికి అరుణ్ జైట్లీ పార్థివదేహం

Last Updated : Aug 24, 2019, 06:05 PM IST
ప్రధాని తరపున డా హర్షవర్థన్, అమిత్ షా తరపున జేపి నడ్డా నివాళి

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే అరుణ్ జైట్లీ పార్థివదేహాన్ని ఎయిమ్స్ అధికారుల బృందం ఆయన కుటుంబసభ్యులకు అప్పగించింది. అనంతరం అరుణ్ జైట్లీ పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసానికి చేర్చారు. అంతకన్నా ముందే కేంద్ర మంత్రి డా హర్షవర్థన్, బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డా ఎయిమ్స్‌ని సందర్శించి అరుణ్ జైట్లీ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. 

ప్రస్తుతం ప్రధాని అందుబాటులో లేకపోవడంతో ఆయన తరపున కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అరుణ్ జైట్లీ పార్థివదేహానికి నివాళి అర్పించగా మరో కేంద్ర మంత్రి, బీజేపి చీఫ్ అమిత్ షా తరపున బీజేపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా నివాళి అర్పించారు.

Trending News