Corona cases in India: మళ్లీ పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 434 కొవిడ్ మరణాలు

Corona cases in India: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 7 వేల పైన కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు సైతం ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 10:53 AM IST
  • దేశంలో కరోనా కేసుల్లో భారీ వృద్ధి
  • ఒక్క రోజులో 434 కొవిడ్ మరణాలు
  • పెరుగుతున్న థార్డ్​ వేవ్​ భయాలు
Corona cases in India: మళ్లీ పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 434 కొవిడ్ మరణాలు

India corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన కొవిడ్ కేసులు ఒక్క సారిగా భారీగా పెరిగాయి.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,495 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 12,05,775 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా ఈ కేసులు బయటపడినట్లు తెలిపింది.

కరోనా మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 434 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 6,960 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, దీనికి తోడు ఒమిక్రాన్​ భయాలు (Omicron scare) దేశంలో థార్డ్​వేవ్ భయాలను పెంచుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం (Omicron cases in India) 236 ఒమిక్రాన్​ కేసులు బయపడ్డట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మరిన్ని వివరాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 78,291 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.23 శాతంగా ఉంది.

కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,78,759 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.38 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశంలో 34,765,976 మందికి కరోనా సోకగా.. అందులో  34,208,926 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది.

వ్యాక్సినేషన్ ఇలా..

నిన్న దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 70,17,671 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,39,69,76,774 వద్దకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 277,525,716 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,393,665 మంది మహమ్మారికి బలయ్యారు. 248,672,558 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 23,459,493 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

Also read: Omicron Scare: దేశంలో కొవిడ్​​ పరిస్థితులపై నేడు ప్రధాని మోదీ సమీక్ష

Also read: Punjab: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం-కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకే వేతనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News