India Corona Updates: ఇండియాలో మళ్లీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు, వెయ్యి దాటిన Covid-19 మరణాలు

India Corona Updates Today: పలు రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో, కరోనా థర్డ్ వేవ్ గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. కోవిడ్19 నిబంధనలు, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ థర్డ్ వేవ్‌ను సూచిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 1, 2021, 10:23 AM IST
  • ఇండియాలో మళ్లీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు, వెయ్యి దాటిన Covid-19 మరణాలు
  • గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,786 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు
  • దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారితో పోరాడుతూ 1,005 మంది చనిపోయారు
India Corona Updates: ఇండియాలో మళ్లీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు, వెయ్యి దాటిన Covid-19 మరణాలు

India corona cases today: ఇండియాలో డెల్టా, డెల్టా ప్లస్ కరోనా పాజిటివ్ కేసులు పలు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో, కరోనా థర్డ్ వేవ్ గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. కోవిడ్19 నిబంధనలు, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ థర్డ్ వేవ్‌ను సూచిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

భారత్‌లో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,786 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే దేశంలో ఇప్పటివరకూ మొత్తం 3,04,11,634కు (30 కోట్ల 4 లక్షల 11 వేల 634)కు చేరుకుంది. కరోనా వైరస్ (CoronaVirus) పాజిటివ్ కేసులు యాభై వేలకు దిగువన నమోదుకావడం కాస్త ఊరట కలిగిస్తున్నా, కోవిడ్19 మరణాలు మరోసారి వెయ్యి దాటాయి. దేశవ్యాప్తంగా కరోనాతో పోరాడుతూ 1,005 మంది చనిపోగా, మొత్తం కరోనా మరణాలు 3,99,459 (3 లక్షల 99 వేల 459)కు చేరుకున్నాయి. 

Also Read: SBI New Charges: జులై 1 నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే 5 కొత్త రూల్స్ ఇవే 

తాజాగా మరో 61,588 మంది కరోనా మహమ్మారిని జయించారు. గత ఏడాది నుంచి ఇండియాలో ఇప్పటివరకూ 2,94,88,918 (2 కోట్ల 94 లక్షల 88 వేల 918) మంది కోవిడ్19 బారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జులై 1 ఉదయం నాటికి దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 5,23,257 ఉన్నాయి. ఇండియాలో కరోనా (Covid-19) రికవరీ రేటు 97 శాతానికి చేరుకుంది. కోవావాక్స్ కరోనా వ్యాక్సిన్‌ను మొదట పెద్దవారిపై ప్రయోగాలు చేసిన అనంతరం 2 నుంచి 17 ఏళ్ల చిన్నారులపై ఫేజ్2 మరియు 3 క్లినికల్ ట్రయల్స్ జరపాలని ప్రభుత్వ ప్యానెల్ సీరం ఇనిస్టిట్యూట్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

Also Read: Covid-19 Drug 2-DG: కోవిడ్19 మెడిసిన్ 2డీజీని విడుదల చేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News