పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తమ ఖాతాదారులకు చేదు వార్తను అందించింది. ఖాతాదారుల వడ్డీ రేట్లను సవరించి షాకిచ్చింది.

Last Updated : Mar 6, 2020, 04:52 PM IST
పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్

న్యూఢిల్లీ: ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఖాతాదారుల నగదుపై వడ్డీ రేటను ఈపీఎఫ్ఓ తగ్గించింది. 2019-20 ఏడాదికిగానూ వడ్డీరేట్లను 8.50గా చేస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. మార్చి 5న (గురువారం) EPFO సెంట్రల్ బోర్డ్ ట్రస్టీలు భేటీ అనంతరం తమ నిర్ణయాన్ని వెల్లడించారు. 2018-19 ఏడాదికిగానూ ఈ వడ్డీరేటు 8.65 శాతంగా ఉండేది. దీంతో పీఎఫ్ ఖాతాదారులందరి నగదుపై వడ్డీరేటు తగ్గనుంది.

Also Read: రూ.299తో కరోనా ఇన్సూరెన్స్.. ప్రయోజనాలేంటో తెలుసా?

పీఎఫ్‌ ఖాతాలపై వడ్డీరేటును 8.65 శాతం నుంచి  8.5 శాతానికి కుదించినట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ వెల్లడించారు.  PF వడ్డీ రేట్లలో కోత విధించడంతో ఈపీఎఫ్‌వోలోని దాదాపు 6 కోట్ల మంది ఖాతాదారులను ప్రభావం పడనుంది. కాగా, పీఎఫ్ ఖాతాలపై వడ్డీరేట్లను సవరించాలని గత కొంతకాలం నుంచి సంస్థ యోచిస్తున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ బ్యూటీతో నాటీగా విజయ్ దేవరకొండ

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News