గోవాకు వచ్చే దేశీయ పర్యాటకుల్లో చాలామంది పనికిమాలినవారే..!

గోవాకి వచ్చే దేశీయ పర్యాటకుల్లో చాలామంది పనికిమాలినవారే అంటూ ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Feb 11, 2018, 03:20 PM IST
గోవాకు వచ్చే దేశీయ పర్యాటకుల్లో చాలామంది పనికిమాలినవారే..!

గోవాకి వచ్చే దేశీయ పర్యాటకుల్లో చాలామంది పనికిమాలినవారే అంటూ ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పర్యాటకుల వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ‘రాష్ట్ర జనాభా కన్నా.. ఇక్కడికి ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య ఆరు రెట్లు అధికంగా ఉంది. వీళ్లంతా గొప్ప వాళ్లేం కాదు. భూమి మీదే పనికిమాలినవారు' అని అన్నారు.

గోవాలో ప్రస్తుత సమస్యలకు ఉత్తరాది రాష్ట్రాలే కారణమంటూ.. అక్కడి వారు గోవాను మరో హర్యానాలా మార్చాలనుకుంటున్నారని అన్నారు. కొన్ని రోజులు సేదతీరడానికి వచ్చే వీళ్లకి.. ఎలా అవగాహన కల్పించేది? ఆదాయం, సామాజిక, రాజకీయ అవగాహన, ఆరోగ్య సూచీల విషయంలో..  దేశంలో అందరికన్నా గోవా ప్రజలు ముందున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకన్నా మనం ఉన్నతులం’’ అని సర్దేశాయ్‌ వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో.. మంత్రి సర్దేశాయ్‌ వివరణ ఇచ్చుకున్నారు. తాను దేశీయ పర్యాటకులందరినీ పనికిమాలినవారని అనలేదని.. కొన్ని వర్గాల వల్ల మాత్రం సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. తనవి విద్వేషపూరిత వ్యాఖ్యలు కాదని.. గోవా ప్రజల మనోగతాన్ని చెప్పానని  అన్నారు.

Trending News