నేను చివరి శ్వాస వరకు ఓటు వేస్తా..

70 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్న ఢిల్లీలోని, గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గంలో 110 సంవత్సరాల అతి పెద్ద వయస్కురాలైన ఓటరు కలితరా మండల్ శనివారం తన ఓటు  హక్కును వినియోగించుకున్నారు.  

Last Updated : Feb 8, 2020, 02:50 PM IST
నేను చివరి శ్వాస వరకు ఓటు వేస్తా..

ఢిల్లీ: 70 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్న ఢిల్లీలోని, గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గంలో 110 సంవత్సరాల అతి పెద్ద వయస్కురాలైన ఓటరు కలితరా మండల్ శనివారం తన ఓటు  హక్కును వినియోగించుకున్నారు.

చిత్తరంజన్ పార్కులోని ఎస్‌డిఎంసి ప్రైమరీ స్కూల్‌లో ఓటు వేసిన మండల్‌ను ఆమె ఇంటి నుంచి తీసుకెళ్తుండగా ఎన్నికల  అధికారులు పూలతో స్వాగతం పలికారు. ఆమె ఓటు వేసిన తర్వాత ఇంటికి చేరుస్తామని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం దక్షిణ-మధ్య బంగ్లాదేశ్‌లో ఉన్న బరీషాల్‌కు చెందిన కలితర మండల్, గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసినట్లు గుర్తు చేసుకున్నారు. శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హత సాధించిన 130 మంది సెంటెనరియన్ ఓటర్లలో ఆమె ఒకరు.

నేను బతికి ఉన్నంతవరకు ఓటు వేస్తాను. నేను బరీషాల్‌లో నివసిస్తున్నప్పుడు విభజనకు ముందు ఓటు వేశానని మండల్ అన్నారు. విభజనకు ముందు తాను ఎవరికి ఓటు వేశానో తనకు గుర్తు లేదని మండల్ అన్నారు. తరువాత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఓటు వేయడాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. విభజన తరువాత, మేము చాలాకాలం శరణార్థి శిబిరంలో నివసించాము. అప్పట్లో ఇంటి వద్దకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం నాకు గుర్తుందని ఆమె అన్నారు.

1978లో ఆమె పెద్ద కొడుకు ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డారని, రెండవ కుమారుడు 1984లో వ్యాపారం ప్రారంభించిన తరువాత ఇక్కడే ఉండిపోయామని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులకు తెలుసా అని అడిగినప్పుడు, ఆమెకు రెండు రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలు మాత్రమే తెలుసు అని అన్నారు.

గతంలో తిలక్ నగర్‌లో నివసించిన అతి పెద్ద ఓటరు బచ్చన్ సింగ్(111), 2019 ఎన్నికలలో ఓటు వేసిన ఆయన, గత డిసెంబర్‌లో మరణించారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Trending News