చిరంజీవి, రామ్ చరణ్‌లకు ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం

చిరంజీవి, రామ్ చరణ్‌లకు ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం

Last Updated : Nov 1, 2019, 03:45 PM IST
చిరంజీవి, రామ్ చరణ్‌లకు ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లకు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి కార్యాలయం నిర్వహించిన ‘ఛేంజ్‌ వితిన్‌ మీట్‌’ కార్యక్రమానికి బాలీవుడ్‌ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులందరూ హాజరైన సంగతి తెలిసిందే. మన తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక్కరికే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందినట్టు టాక్ వినిపించింది. దక్షిణాది సినీ ప్రముఖులకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించకపోవడంపై దక్షిణాది నుంచి పలువురు ప్రముఖులు కేంద్రంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అందులో రామ్ చరణ్ ఉపాసన కూడా ఒకరు. 

ఇదిలావుండగా ఉపాసన అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో చిరంజీవి, రామ్ చరణ్‌లకు ఈ ఆహ్వానం అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Trending News