అరుణ్ జైట్లీకి నివాళులు అర్పించిన ప్రముఖులు

అరుణ్ జైట్లీకి నివాళులు అర్పించిన ప్రముఖులు

Last Updated : Aug 25, 2019, 10:54 AM IST
అరుణ్ జైట్లీకి నివాళులు అర్పించిన ప్రముఖులు

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్థివదేహానికి పలువురు కేంద్ర ప్రముఖులు నివాళి అర్పించారు. ఢిల్లీలోని కైలాష్ కాలనీలోని జైట్లీ నివాసానికి చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అక్కడే జైట్లీ పార్థివదేహానికి నివాళి అర్పించి ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. అరుణ్ జైట్లీ పార్థివదేహానికి నివాళి అర్పించిన వారిలో బీజేపి కురువృద్ధుడు ఎల్‌కే అద్వాని, కేంద్ర మంత్రులు అమిత్ షా, సుబ్రహ్మణ్యం జైశంకర్, రవిశంకర్ ప్రసాద్, రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా ఉన్నారు.

ఇవాళ మధ్యాహ్నం లక్నో పర్యటనలో ఉన్న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అరుణ్ జైట్లీ మృతి వార్త తెలుసుకున్న అనంతరం హుటాహుటిని ఢిల్లీకి చేరుకుని జైట్లీ నివాసానికి వచ్చారు. అక్కడే ప్రధాని నరేంద్ర మోదీ తరపున జైట్లీ పార్థివదేహానికి రాజ్‌నాథ్ సింగ్ నివాళి అర్పించారు.

Trending News