మెగాస్టార్‌‌కి త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చిందట.. కొరటాల చిత్రం తర్వాత పట్టాలెక్కుతున్న ప్రాజెక్టు..!

సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చే ఓ చిత్రంలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 

Last Updated : Nov 17, 2018, 08:38 PM IST
మెగాస్టార్‌‌కి త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చిందట.. కొరటాల చిత్రం తర్వాత పట్టాలెక్కుతున్న ప్రాజెక్టు..!

సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చే ఓ చిత్రంలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి చిత్రాలతో తనకంటూ ఒక  ప్రత్యేక శైలిని దర్శకుల్లో సొంతం చేసుకున్న కొరటాల రాసిన కథ.. చిరుకి నచ్చడంతో ఆయన ఆ ప్రాజెక్టుకి సైన్ చేశారని ఇండస్ట్రీ టాక్. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ చిత్రం విడుదలయ్యాక చిరు చేయబోయే మరో  చిత్రానికి కూడా కథ ఓకే అయ్యిందట.

అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, ఆఆ,  అరవింద సమేత లాంటి చిత్రాలతో విజయాలు కైవసం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.  ముఖ్యంగా చాలా వైవిధ్యమైన కథను త్రివిక్రమ్ ఎంచుకోవడంతో.. ఆ ప్రాజెక్టు పై చిరు కూడా ఆసక్తి పెంచుకుంటున్నారని తెలుస్తోంది. కాగా.. కొరటాలతో సినిమా చేస్తున్న చిరంజీవి తమ చిత్ర షూటింగ్‌ను జనవరి నుండి ప్రారంభిస్తే బాగుంటుందని వెల్లడించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

కాగా.. ప్రస్తుతం చిరు నటిస్తున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2019 వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత చిరు, కొరటాల చిత్రంలో నటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ త్రివిక్రమ్ సినిమా మీద ఇంకా సందేహాలు ఉన్నాయని అంటున్నారు పలువురు ఇండస్ట్రీ వ్యక్తులు. ఎందుకంటే ప్రస్తుతం బోయపాటి కూడా చిరుతో ఈ సినిమా కోసం కథను సిద్ధం చేశారని టాక్. అయితే బోయపాటి, త్రివిక్రమ్ చిత్రాలలో ఏ సినిమాకి చిరు అవకాశం ఇస్తారన్నది మాత్రం తెలియదు. 

Trending News