మాటే మంత్రము, 8 ఆగస్ట్, 2018 ఎపిసోడ్: తులసిని ప్రాణాపాయం నుండి కాపాడాలని తపిస్తున్న వసుంధర

మాటే మంత్రము సీరియల్ తాజా ఎపిసోడ్ విశేషాలు

Last Updated : Aug 10, 2018, 01:26 PM IST
మాటే మంత్రము, 8 ఆగస్ట్, 2018 ఎపిసోడ్: తులసిని ప్రాణాపాయం నుండి కాపాడాలని తపిస్తున్న వసుంధర

మీ అభిమాన జీ తెలుగులో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న మాటేమంత్రము సీరియల్ తాజా ఎపిసోడ్ విశేషాలు. కాంతం చేసిన దారుణం వల్ల తులసి ప్రాణాపాయ పరిస్ధితుల్లో పడుతుంది. దాంతో ఆమెను హాస్పిటల్‌కి తరలిస్తారు. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్న తల్లి తులసి ప్రాణాలు కాపాడటానికి తల్లడిల్లిపోతున్న వసుంధరను చూసి కాంతం తనలో తానే వ్యంగ్యంతో కూడిన నవ్వు నవ్వుకుంటుంది. ఇంతటికీ కారణవైున కాంతం వెంటనే జోగికి ఫోన్ చేసి తులసి హాస్పిటల్‌లో ఆఖరి దశలో వుందని వచ్చి వసుంధరతో పెళ్లికి డీల్ సెట్ చేసుకోమని చెబుతుంది. అది విన్న జోగి వెంటనే అక్కడికి బయల్దేరుతాడు. దీనంతటికీ కారణం మీ అక్కే అని అలేఖ్య మనసులో విషం నూరిపోస్తుంది కాంతం . అదే మాట అక్క వసుంధరతో అంటుంది అలేఖ్య. 

ఇదిలావుంటే, వంశీ అదే హాస్పిటల్‌కి తాను ప్రాణాలు కాపాడిన వ్యక్తి కోసం వచ్చి అనుకోకుండా వసుంధరను కలుస్తాడు. వంశీ ఆమెను తనతో రమ్మంటాడు. తన తల్లి గురించి చెప్పి వంశీతో వెళ్లకుండా వుంటుంది వసుంధర. మీ అమ్మ ఆరోగ్యం బాగయ్యాక కలవమని చెప్పి వంశీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 

 

పేషెంట్ స్పృహలోకి రాలేదని, కానీ తులసి క్షేమం అని చెప్తాడు డాక్టర్. తులసి బతకాలంటే పదిలక్షలు ముందు డిపాజిట్ చేయలని హాస్పిటల్  సిబ్బంది సూచిస్తారు. అప్పుడే వసుంధరరకు వంశీ గుర్తొచ్చి అతడి సహాయం కోసం కాల్ చేస్తుంది. కానీ వంశీ ఫోన్ చూసుకోకుండా హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈలోగా అక్కడకు వచ్చిన జోగిందర్.. తనను పెళ్లి చేసుకోమని, ఆ డబ్బు నేనిస్తాని వసుంధరకు చెబుతాడు. దీంతో విధిలేని పరిస్ధితుల్లో వసుంధర సంతకం పెట్టడానికి సిద్దమవుతుంది. మరి ఆమె సంతకం పెడుతుందా లేదా ? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మాటే మంత్రం సీరియల్ వీక్షించాల్సిందే.  ఈ సీరియల్ పూర్తి ఎపిసోడ్స్‌ని ZEE5లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Trending News