కళ్యాణ వైభోగం, 1 ఆగస్ట్, 2018 ఎపిసోడ్‌లో మంగ ఊహించని మలుపులు

ZEE5 లో మీరు అభిమానించే జీ తెలుగు టీవీ సీరియల్స్

Last Updated : Aug 2, 2018, 06:57 PM IST
కళ్యాణ వైభోగం, 1 ఆగస్ట్, 2018 ఎపిసోడ్‌లో మంగ ఊహించని మలుపులు

మీ అభిమాన జీ తెలుగులో మీరు అభిమానించే కళ్యాణ వైభోగం తాజా ఎపిసోడ్‌లో మంగ ఊహించని మలుపులు సీరియల్‌పై ఆసక్తిని పెంచుతాయి. జై, మంగ దేవీపురం వెళ్తుండగానే జైకి ఓ ఫోన్ కాల్ వస్తుంది. అర్ధాంతరంగా దేవీపురం వెళ్లడం విరమించుకుని వెనక్కి బయల్దేరుదాం అంటూ జై, మంగతో సహా ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో బామ్మ గుండెనొప్పితో బాధపడుతూ ఉండటం, ఆ పక్కనే స్వరూప, నిత్య గర్వంగా తనవైపు చూడటం చూస్తే, తనని దేవీపురం వెళ్లకుండా చేసేందుకు ఏదో జరిగిందని మంగకు అర్థమవుతుంది. బామ్మ ప్రవర్తన తీరు చూసి పక్కనే వున్న చంద్రిక, ఆమె భర్త ముసల్దానికి బీపీ వచ్చిందని అనుకుంటారు. దేవీకి పూజ చేయాలి బామ్మా అని మంగ నచ్చచెప్పి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ.. బామ్మ మాత్రం దేవీపురం వెళ్లడానికి అస్సలే వీల్లేదంటూ తేల్చిచెబుతుంది.

 

br> బామ్మ అంత నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటని మంగ తెలుసుకునే ప్రయత్నం చేసినా ఆమె మాత్రం ఏమీ చెప్పదు. స్వరూప, నిత్యలు మంగ మీద విజయం ఎలా సాధించారో చెప్తారు. “ఇప్పుడు జై, నిత్య ఇద్దరూ దేవీపురం వెళ్లేసరికి చలమయ్య శాపం గురించి చెప్తాడు కదా” అంటూ స్వరూప చెప్పడం వల్లే బామ్మ వెంటనే జై, మంగలను వెనక్కి పిలిపిస్తుంది. మంగ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతుంది. 

 

ఇదిలావుంటే, అదే సమయంలో ఇంట్లో వ్రతం ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, చంద్రిక, ఆమె భర్త కలిసి కలశంలో కాలకూట విషం కలిపి దాన్ని పూజలో పెడతారు. పూజ అయ్యాక ఉపవాసం విడిచే ముందు కాలకూట విషం కలిపిన నీటిని మంగ చేత జై తాగిస్తాడు. మరి నిత్య స్థానంలో ఉన్న మంగ పరిస్థితేంటో తెలుసుకోవాలంటే కళ్యాణ వైభోగం సీరియల్ చూడాల్సిందే. ఈ సీరియల్ పూర్తి ఎపిసోడ్స్‌ని ZEE5లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Trending News