Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు షాకింగ్ న్యూస్..ఆ సినిమాలు ఇక లేనట్టే?

Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక షాకింగ్ న్యూస్, ఆయన రాజకీయాల్లో బిజీ అవుతున్న క్రమంలో సినిమాల విషయాల్లో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 13, 2022, 08:28 PM IST
Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు షాకింగ్ న్యూస్..ఆ సినిమాలు ఇక లేనట్టే?

Shocking News to Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత తాను ఇక సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని రాజకీయాల్లోనే పూర్తిగా నిమగ్నం అవుతానని చెబుతూ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీతో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. అయితే 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు పవన్ కు పట్టం కట్ట లేదు సరి కదా ఆయన పోటీ చేసిన ఒక్కచోట కూడా గెలిపించలేదు.

వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో జగన్ కనుక మంచిగా పాలన చేస్తే తాను మళ్ళీ వెనక్కి వెళ్లి సినిమాలు చేసుకుంటానని పవన్ ప్రకటించారు. ఆ తర్వాత జగన్ పాలనను  ఒకపక్క తూర్పారబడుతూనే మరో పక్క సినిమాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. అలా ఆయన హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయింది గానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఇబ్బంది పడింది. భీమ్లా నాయక్ సినిమా ఇప్పటికే ప్రేక్షకులకు ముందుకు వచ్చి ఓ మాదిరి టాక్ తెచ్చుకుంది.

ఇప్పుడు ఆయన హీరోగా దాదాపు మూడు సినిమాలు ప్రకటించారు. క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, బండ్ల గణేష్ నిర్మాణంలో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ పూర్తిగా ఏపీ రాజకీయాల మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆయన హరిహర వీరమల్లు సినిమా ఒక్కటే పూర్తి చేస్తారని తెలుస్తోంది. మిగిలిన రెండు సినిమాలను ఎన్నికల నేపథ్యంలో పక్కన పెడుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు హరీష్ శంకర్ అలాగే సురేందర్ రెడ్డి లను వేరే సినిమాలు చేసుకోమని పవన్ టీమ్ నుంచి సందేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది . ఈ నేపద్యంలో హరీష్ శంకర్ సల్మాన్ ఖాన్ తో సినిమా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ముంబైలోని మకాం వేసిన ఆయన సల్మాన్ ఖాన్ డేట్స్ ఇచ్చిన తర్వాతే తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడు బాలీవుడ్ కంటే టాలీవుడ్ సేఫ్ అని భావిస్తున్న బాలీవుడ్ స్టార్లు మన తెలుగు సినిమాల్లో అతిథి పాత్రలైనా చేయడానికి వెనకాడటం లేదు. అలాంటిది ఒక సూపర్ హిట్ తెలుగు డైరెక్టర్ తన డైరెక్టు చేస్తానంటే సల్మాన్ ఖాన్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఒకవేళ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కితే దాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉంది. అయితే ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందనేది చూడాల్సి ఉంది.

Also Read: Allu Arjun Fans Blunder : పప్పులో కాలేసిన అల్లు అర్జున్ ఫాన్స్.. ఆ లాజిక్ ఎలా మిస్సయ్యారు భయ్యా?

Also Read: Unstoppable with NBK 2: షోకి మరో మాజీ సీఎం.. మాజీ స్పీకర్..ఆహా వారి ప్లానింగ్ లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News