Ram Charan - RC16 Pooja Ceremony: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబుల సినిమా..

Ram Charan - RC16 Pooja Ceremony: రామ్ చరణ్ .. రాజమౌళి డైరెక్షన్‌లో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఆ సినిమా చేస్తూనే  బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 20, 2024, 11:43 AM IST
Ram Charan - RC16 Pooja Ceremony: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబుల సినిమా..

Ram Charan - RC16 Pooja Ceremony: దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో తెరరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా లెవల్లోనే కాదు.. గ్లోబల్ లెవల్లో ఫేమసయ్యారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా ఒదిగిపోయిన తీరును ఎవరు మరిచిపోలేదు. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రతి సినిమాను గ్లోబల్ లెవల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రామ్  చరణ్. ప్రస్తుతం ఈయన  శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంచర్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయింది. ఆ సంగతి పక్కన పెడితే.. రామ్ చరణ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయనున్నాడు. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకలో హీరోయిన్‌గా నటిస్తోన్న జాన్వీ కపూర్ హాజరై చూపరులను ఆకట్టుకుంది.

ఈ సందర్బంగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ సహా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సినిమాను వ్రిద్ది సినిమాస్ సంస్థపై సుకుమార్ రైటింట్స్, మైత్రీ మూవీ  మేకర్స్‌తో కలిసి కిలారు వెంకట సతీష్ ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు.  ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శంకర్, బోనీ కపూర్, ఏఆర్ రెహమాన్, సుకుమార్ తదితరులు హాజరయ్యారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఈ సినిమా హీరో క్యారెక్టర్‌తో పాటు కథానాయిక పాత్రకు మంచి స్కోప్ ఉంది. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ను తీసుకున్నారు. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో చాలా యేళ్ల తర్వాత రెహమాన్ మ్యూజిక్ అందించడం విశేషం. ఈ సినిమాకు 'పెద్ది' టైటిల్ అనుకుంటున్నారు. జాన్వీ కపూర్.. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం రెండు పార్టులుగా రానుంది. ఫస్ట్ పార్ట్ ఈ యేడాది ఏప్రిల్‌లో అనుకున్నారు. కానీ షూటింగ్ లేట్ కావడంతో ఈ మూవీని అక్టోబర్ 10కి రిలీజ్ డేట్  పోస్ట్ పోన్ చేసారు.

అటు రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ పెయిర్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. రామ్ చరణ్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారి నుంచి ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. అటు రామ్ చరణ్ ప్యాన్ ఇండియా లెవల్లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.  

Also read: AP Summer Holidays: విద్యార్ధులకు శుభవార్త, ఈసారి ముందస్తు సెలవులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News