Game Changer: శంకర్ కు రామ్ చరణ్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్.. దెబ్బకు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ప్రకటన..!

Ram Charan - Game Changer: రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఏ ముహూర్తానా ఈ సినిమా స్టార్ట్ చేసారో అప్పటి నుంచి ఈ సినిమాకు ఏదో అవాంతరం వచ్చి పడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ అంటూ మూవీ మేకర్స్ పెద్ద అనౌన్స్ మెంట్ చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 26, 2024, 04:20 AM IST
Game Changer: శంకర్ కు రామ్ చరణ్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్.. దెబ్బకు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ప్రకటన..!

Ram Charan - Game Changer: అవును శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఎపుడు సినిమా అనౌన్స్ చేసాడో అప్పటి నుంచి ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మధ్యలో శంకర్.. ‘భారతీయుడు 2’ మూవీ పూర్తి చేయాల్సి రావడంతో ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తుంది. ఈ సినిమా స్టార్ట్ చేసి రెండేళ్లు కావొస్తోంది. కానీ రిలీజ్ డేట్ పై ఇప్పటికీ  క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘జరగండి జరగండి’ పాటను రిలీజ్ చేసారు. ఈ పాటను ‘భారతీయుడు 2’ లో కూడా యూజ్ చేసుకున్నాడు శంకర్. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. అలాంటి సమయంలో ఈ మూవీ నుంచి మరో బిగ్ అప్టేట్ అంటూ అభిమానులను ఊరిస్తూ.. ఈ మూవీ నుంచి రెండో పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

దీంతో రామ్ చరణ్ అభిమానులు.. పాటల సరే.. రిలీజ్ డేట్ ఎపుడు అంటూ శంకర్ తీరుపై మండిపడుతున్నారు. అయితే ఈ సినిమాను క్రిస్మస్,న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా.. మాకు నమ్మకం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత కొంత గ్యాప్ లో ఆచార్యతో రామ్ చరణ్ పలకరించినా.. రామ్ చరణ్.. పూర్తి స్థాయిలో సోలో హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పాటను కూడా రిలీజ్ చేసారు. తాజాగా రెండో పాటను సెప్టెంబ‌ర్ 28న ‘రా మ‌చ్చా మ‌చ్చా’ ప్రోమో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ప‌ల్ల‌విలోని లైన్స్ చూస్తుంటే.. మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్ నుంచి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ మూవీ నుంచి ప‌క్కా మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతుందనే విషయం స్పష్టమైంది.
ఇప్ప‌టికే ‘గేమ్ చేంజర్’ నుంచి  వచ్చిన ‘జరగండి జరగండి..’ పాట ఎంత సెన్సేష‌న్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే.

విన‌య విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజ‌ర్‌లో మరోసారి జోడిగా నటించారు.  ఈ సినిమాను ఇయర్ ఎండింగ్ అంటూ హింట్ ఇచ్చినా.. ఆ డేట్ లో అసలు విడుదల అవుతుందా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తోన్నారు.  ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
 

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News