OG Movie Update: పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... అగ్ని తుపాన్ వచ్చేస్తోంది..

Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సాహో ఫేమ్ సుజిత్ కాంబోలో రాబోతున్న మూవీ ఓజీ. తాజాగా ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది ఎలా ఉందంటే...  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2023, 04:33 PM IST
OG Movie Update: పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... అగ్ని తుపాన్ వచ్చేస్తోంది..

Pawan kalyan OG Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఓ వైపు రాజకీయాల్లో పుల్ బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమా షూటింగ్స్ లో జోరుగా పాల్గొంటారు. రీసెంట్ గా బ్రో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పవన్ ఇక ఇప్పుడు ఓజీగా(OG Movie) రానున్నారు. ఈ చిత్రానికి రన్ రాజా రన్, సాహో సినిమాలను తెరకెక్కించిన సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'ఓజీ' అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి అప్ డేట్ ను రివీల్ చేశారు మేకర్స్. సెప్టెంబరు 02న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం ఓ సర్ ప్రైజ్ ను ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. 

తాజా పోస్టర్ లో పవన్ తన అనుచరులతో కలిసి శత్రువులను చంపి తిరిగి వెళ్తున్నట్లు కనిపించారు. ''లొకేషన్: చర్చ్ గేట్, సౌత్ బొంబాయి, టైమ్: 2.19(ఏ.ఎం.), రైన్ ఫాల్ డెన్సిటీ: 24 ఎం.ఎం. బ్లడ్ ఫ్లో డెన్సిటీ: 32 ఎం. ఎం, వెపన్స్ యూజ్డ్: బ్యారెలడ్ షాట్ గన్'' అంటూ కొన్ని వివరాలను పోస్టర్ పై డిజైన్ చేసారు. అంతేకాకుండా హీట్ వేవ్ ను ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి. అగ్ని తుపాన్ వస్తోందంటూ ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. 

ఈ సినిమా కథ జపాన్-ముంబై బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని సమాచారం. ఈ చిత్రంలో పవన్ గ్యాంగస్టర్ గా కనిపించనున్నారు. ఆయనకు జోడిగా ప్రియా అరుళ్ మోహన్ నటించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

మరోవైపు క్రిష్ దర్శకత్వంలో 'హరిహరవీరమల్లు' అనే చిత్రంలో నటిస్తున్నాడు పవన్. ప్రస్తుతం పవన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో వారాహి యాత్ర చేస్తున్నారు. పూర్తిస్తాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురిపించింది. ఆ తర్వాత రానాతో కలిసి భీమ్లానాయక్ కూడా బాగానే ఆడింది. రీసెంట్ గా తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి చేసిన బ్రో సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.  తొలి మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కును అందుకుంది. 

Also Read: Ustaad Movie: 'ఉస్తాద్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, నాని.. ఈవెంట్‌ ఎక్కడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News