'అల వైకుంఠపురములో..' నుంచి తొలగించిన సీన్ ఇదిగో..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్  కాంబినేషన్ లో వచ్చిన సినిమా  'అల వైకుంఠపురములో..' సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టింది. పూజా హెగ్డే, నవదీప్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.   

Last Updated : Mar 17, 2020, 04:57 PM IST
'అల వైకుంఠపురములో..' నుంచి తొలగించిన సీన్ ఇదిగో..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్  కాంబినేషన్ లో వచ్చిన సినిమా  'అల వైకుంఠపురములో..' సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టింది. పూజా హెగ్డే, నవదీప్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. 

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల కాక ముందే మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందన్న అంచనాలు భారీగా బలపడ్డాయి. దానికి తగ్గట్టే .. సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. ఇంకా చెప్పాలంటే .. ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా అలరించింది. 

Read Also:  'కరోనా వైరస్'కు వ్యాక్సిన్.. వచ్చేస్తోంది..!!

ఐతే  సినిమా విడుదలకు ముందు దర్శక, నిర్మాతలు, హీరోలను ఒక అంశం బాగా కలవరానికి గురి చేసింది. సినిమా నిడివి ఎక్కువగా రావడంతో వారంతా కలవరపడ్డారు. చాలా వరకు సినిమాల్లోని దృశ్యాలను తీసివేశారు. అలాంటి ఓ దృశ్యాన్నే ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఆన్ లైన్‌లో విడుదల చేసింది. ఆ సీన్ ఇప్పుడు మీ కోసం. . చూడండి.

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News